May 25, 2026

రాష్ట్ర శాసనమండలి సభ్యుల నియామకానికి నిబంధనలు

 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(3)(e) అనేది రాష్ట్ర శాసనమండలి (Legislative Council లేదా Vidhan Parishad) సభ్యుల నియామకానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిబంధన. ఈ నిబంధన ప్రకారం, ఒక రాష్ట్ర శాసనమండలిలోని మొత్తం సభ్యులలో మిగిలిన భాగాన్ని (అంటే దాదాపు 1/6 వంతు సభ్యులను) ఆ రాష్ట్ర గవర్నర్ నామినేట్ (నియమించాల్సి) ఉంటుంది.

 గవర్నర్ ఎవరిని నామినేట్ చేస్తారు?

 (అర్హతలు)

ఆర్టికల్ 171 లోని క్లాజ్ (5) ప్రకారం,  సమాజంలో  5 రంగాలలో,  విశేషమైన జ్ఞానం లేదా ప్రాక్టికల్ అనుభవం (Practical Experience) ఉన్న వ్యక్తులను గవర్నర్ శాసనమండలి సభ్యులుగా (MLC) నామినేట్ చేస్తారు.

 1. సాహిత్యం (Literature): గొప్ప రచయితలు, కవులు లేదా భాషా కోవిదులు.

 2. శాస్త్ర సాంకేతిక రంగాలు (Science): శాస్త్రవేత్తలు, పరిశోధకులు.

 3. కళలు (Art) నటన, సంగీతం, చిత్రలేఖనం, శిల్పకళ వంటి రంగాలలో నిపుణులు.

 4. సహకార ఉద్యమం (Co-operative Movement) సహకార సంఘాల బలోపేతానికి కృషి చేసినవారు.

 5. సామాజిక సేవ (Social Service) సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల కోసం సేవలందించిన సామాజిక కార్యకర్తలు.

 శాసనమండలి (ఎగువ సభ) అనేది మేధావుల సభగా పిలవబడుతుంది.

 ఎన్నికల్లో నేరుగా పోటీ చేయకపోయినా, సమాజానికి ఉపయోగపడే వివిధ రంగాల మేధావుల సేవలను చట్టసభలకు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ 171(3)(e) ని పొందుపరిచారు. 

ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా భారతదేశంలో కేవలం 6 రాష్ట్రాలకు మాత్రమే ఇలాంటి శాసనమండలి.

 తెలంగాణ రాష్ట్రంలో శాసనమండలిలో 40 MLC స్థానాలు ఉన్నాయి. 

అందులో 6 MLC స్థానాలను గవర్నర్  నామినేట్ చేస్తారు.

No comments:

Post a Comment

రాష్ట్ర శాసనమండలి సభ్యుల నియామకానికి నిబంధనలు

  భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(3)(e) అనేది రాష్ట్ర శాసనమండలి (Legislative Council లేదా Vidhan Parishad) సభ్యుల నియామకానికి సంబంధించిన ఒక ...