Jun 20, 2019


మానవేంద్రనాథ్ రాయ్, వెంకట రమణలు
హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం
     అమరావతి, జూన్ 20: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి కోర్టు హాలులో గురువారం ఉదయం చీకటి మానవేంద్రనాథ్ రాయ్, మఠం వెంకట రమణలు హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు తాత్కాలిక రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ న్యాయమూర్తుల నియామక ఉత్తర్వులు చదివి వినిపించగా,  హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్ కుమార్ వారిచేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు బార్ అసోసియేషన్ పాలకవర్గ సభ్యులు, నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...