Jun 12, 2019


శాసనసభాపతిగా తమ్మినేని సీతారామ్ ఏకగ్రీవం
మంత్రి బొత్స సత్యనారాయణ
          సచివాలయం, జూన్ 12: శాసన సభాపతిగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన తమ్మినేని సీతారామ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స  సత్యనారాయణ చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. శాసన సభాపతి పదవికి తమ్మినేని సీతారామ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గురువారం అధికారికంగా ప్రకటిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలతో సంప్రదించి సుదీర్ఘ  రాజకీయ అనుభవం కలిగిన సీతారామ్ ను ఎంపిక చేసినట్లు తెలిపారు. సీతారామ్ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, మూడు సార్లు మంత్రిగా పని చేశారని చెప్పారు. సభ విలువలు, గౌరవాన్ని కాపాడే విధంగా ఆయన వ్యవహరిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరొకరు ఎవరూ నామినేషన్ వేయనందున నిబంధనల ప్రకారం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లేనని చెప్పారు. మంత్రి బొత్స వెంట ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు.  ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సీతారామ్ కు మంత్రి బొత్స, చీఫ్ విప్ శ్రీకాంత్ లు  అభినందనలు తెలిపారు.

No comments:

Post a Comment

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...