బాధ్యతలు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
సచివాలయం, జూన్ 12: ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ
మంత్రి కె.నారాయణ స్వామి బుధవారం ఉదయం సచివాలయం 4వ బ్లాక్ లో ని తన ఛాంబర్ లో పదవీ
బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా ఆయన బ్లాక్ వద్దకు రాగానే వేద పండితులు,
సంబంధిత శాఖల అధికారులు స్వాగతం పలికారు. తన పేషీలో పూజా కార్యక్రమం పూర్తి అయిన
తరువాత ఆయన బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన రాష్ట్రంలో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల
సంఖ్య పెంపు ఫైల్ పైన, తరువాత కమర్షియల్ టాక్స్ విభాగంలోని ఒక ఉద్యోగి మెడికల్
రీయింబర్స్ మెంట్ మంజూరు ఫైల్ పైన సంతకాలు
చేశారు. ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు
స్వీకరించిన అనంతరం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావు
ఆయనకు పుష్ప గచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
No comments:
Post a Comment