2021 మార్చి 1 నుంచి జనాభా
లెక్కల సేకరణ
సచివాలయం, ఏప్రిల్ 26: కేంద్ర ప్రభుత్వం 2021లో
దేశంలోని జనాభా లెక్కలను సేకరించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం
శాఖ జారీ చేసిన ఉత్తర్వులు ఆధారంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్
శుక్రవారం ఇక్కడ జీఓ జారీ చేశారు. ఆ జీఓ ప్రకారం దేశమంతా
2021 మార్చి 1వ తేదీ 00.00 గంటల సమయాన్ని
ప్రామాణికంగా తీసుకొని జనాభా లెక్కలను సేకరిస్తారు. జమ్మూ-కాశ్మీర్, ఉత్తరా ఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలోని మంచు గడ్డకట్టే
కొండ ప్రాంతాలలో మాత్రం అంతకంటే ముందుగానే 2020 అక్టోబర్ 1వ తేదీ 00.00 గంటలను
ప్రామాణికంగా తీసుకొని జనాభా లెక్కలు సేకరిస్తారు.
No comments:
Post a Comment