సచివాలయం,
అక్టోబర్ 5: కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ ఉప ఎన్నికల్లో
ఎన్నికైన భూమా బ్రహ్మానందరెడ్డి ఏపీ శాసనసభ ప్రాంగణంలోని స్పీకర్ చాంబర్ లో శుక్రవారం
ఉదయం శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల
శివప్రసాదరావు బ్రహ్మానందరెడ్డి చేత
ప్రమాణస్వీకారం చేయించారు. ఆయన దైవ సాక్షిగా ప్రమాణం
చేశారు. అనంతరం శాసనసభ నియమనిబంధనల పుస్తకాల బ్యాగ్ ని స్పీకర్ ఎమ్మెల్యే
బ్రహ్మానందరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు
సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, భూమా అఖిల ప్రియ, శాసన సభ ఇన్
ఛార్జి కార్యదర్శి విజయరాజు, డిప్యూటీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తదితరులు
పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
మంగళగిరిలో ముగ్గురు ప్రముఖులకు సన్మానం
మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మూడు రంగాలలో ముగ్గురు నగర ప్రముఖులు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున ...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
No comments:
Post a Comment