Oct 6, 2017

భూమా బ్రహ్మానందరెడ్డి ప్రమాణస్వీకారం


సచివాలయం, అక్టోబర్ 5: కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ ఉప ఎన్నికల్లో ఎన్నికైన  భూమా బ్రహ్మానందరెడ్డి ఏపీ శాసనసభ ప్రాంగణంలోని స్పీకర్ చాంబర్ లో శుక్రవారం ఉదయం శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు  బ్రహ్మానందరెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఆయన దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం శాసనసభ నియమనిబంధనల పుస్తకాల బ్యాగ్ ని స్పీకర్ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, భూమా అఖిల ప్రియ, శాసన సభ  ఇన్ ఛార్జి కార్యదర్శి విజయరాజు, డిప్యూటీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?

దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి...