సచివాలయం,
అక్టోబర్ 25: దివంగత మాజీ ప్రధాన
మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి రోజును ప్రభుత్వం ‘రాష్ట్రీయ సంకల్ప దివాస్’ నిర్వహించాలని ప్రభుత్వ
ప్రధాన కార్యదర్వి (సీఎస్) దినేష్ కుమార్ బుధవారం
ఒక ప్రకటనలో ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఏడాది ఆమె
వర్ధంతి రోజైన 31 అక్టోబర్ నాడు రాష్ట్ర రాజధానుల్లో, జిల్లా కేంద్రాల్లో, ముఖ్యమైన పట్టణాల్లో ర్యాలీలు నిర్వహిస్తుంటారని, అదేమాదిరి ఈ ఏడాది కూడా సచివాలయంలోని అన్ని శాఖల, శాఖాధిపతుల కార్యాలయాల్లో, జిల్లా కేంద్రాల్లో
రాష్ట్రీయ సంకల్ప దివాస్ సందర్భంగా ర్యాలీలు, జాతీయ,
దేశభక్తి గీతాలు ఆలపించడం, ముఖ్యమైన వ్యక్తులు, యువజన నేతలతో ప్రసంగాలు వంటి కార్యక్రమాలు
నిర్వహించాలని ఆ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ
కార్యక్రమాలు స్థానిక అధికారుల, సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారుల సమన్వయంతో నిర్వహించడానికి యువజన, పర్యాటక,
సాంస్కృతి శాఖ తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ఆయా శాఖల బడ్జెట్ లో కేటాయించిన మేరకు శాఖా కార్యాలయాలు, జిల్లాల్లోని అధికారులు ఈ
కార్యక్రమాలకు నిధులు వినియోగించాలని తెలిపారు. సచివాలయంలో ‘రాష్ట్రీయ సంకల్ప దివాస్’ నిర్వహించడానికి సాధారణ
పరిపాలనా శాఖ తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
Subscribe to:
Post Comments (Atom)
ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?
దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
No comments:
Post a Comment