Feb 13, 2019

ప్రజా రాజధాని అమరావతి పుస్తకం ఆవిష్కరించిన సీఎం



       
సచివాలయం, ఫిబ్రవరి 13  :  సీనియర్ జర్నలిస్ట్ శిరందాసు నాగార్జున రాసిన ప్రజా రాజధాని అమరావతిపుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం సచివాలయంలోని 1వ బ్లాక్ లో  ఆవిష్కరించారు. రాష్ట్ర విభజన నుంచి రాజధాని ఎంపిక, అమరావతి ప్రకటన, రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ), అమరావతి అభివృద్ధి సంస్థల  ఏర్పాటు, ల్యాండ్ పూలింగ్ పథకం, రైతులు, రాజధాని గ్రామాల ప్రజలు పొందుతున్న ప్రయోజనాలు రచయిత ఇందులో వివరించారు. ఇప్పటి వరకు జరిగిన, జరుగుతున్న ప్రభుత్వ, ప్రైవేటు భవనాల నిర్మాణాలు, రోడ్లు, కేబుల్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులన్నిటినీ ఫొటోలతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచారు. తాత్కాలిక సచివాలయం మొదలుకొని జుడిషియల్ కాంప్లెక్స్ భవనం, విట్ భవనాల వరకు అన్ని ఫొటోలు ఇందులో ఉన్నాయి. పుస్తకం రాసిన నాగార్జునను ముఖ్యమంత్రి అభినందించారు.

No comments:

Post a Comment

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...