v జెట్ స్పీడ్ తో నిర్మాణం
v గేటెడ్ కమ్యూనిటి తరహాలో ఫ్లాట్లు
v ముందంజలో 5 జిల్లాలు
v 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి
గ్రామాలలో 6 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ), ఎన్టీఆర్ నగర్ పట్టణ గృహనిర్మాణ పథకాల కింద పట్టణ ప్రాంతాలలో 5,24,000 ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో దాదాపు లక్షా 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి
కాగా, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో చాలా చోట్ల
స్థలాలు అందుబాటులో లేకపోవడం వల్ల నిర్మాణాలలో జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు 1,88,930 ప్లాట్లు లబ్దిదారులకు కేటాయించారు. మిగిలిన ప్లాట్లను కూడా త్వరగా
కేటాయించే పనుల్లో అధికారులు ఉన్నారు. మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టి పట్టుదలతో ఉన్నారు. సీఎం ఆదేశాలతో అత్యంత ఆధునిక
పరిజ్ఞానంతో జెట్ స్పీడ్ తో నిర్మాణాలు జరుగుతున్నాయి. గృహ నిర్మాణం వేగంగా జరగడానికి పెండింగ్ బిల్లులను కూడా అంతే వేగంగా
క్లియర్ చేస్తున్నారు. హడ్కో నుంచి రావలసిన నిధులను విడుదల చేయించడానికి వత్తిడి
పెంచుతున్నారు.
లబ్దిదారుల వాటాగా రూ.472.88 కోట్లు చెల్లించారు. వారం, పది రోజుల్లో హడ్కో నుంచి రూ.500 కోట్లు, కేంద్రం నుంచి మరో రూ.500 కోట్లు వచ్చే అవకాశం ఉంది.
వాస్తవానికి బ్యాంకుల నుంచి రుణాలు
పొందిన తరువాత నిర్మాణాలు చేపట్టాలని ముందు అనుకున్నారు. లబ్దిదారుల ఎంపిక, బ్యాంకుల రుణాల మంజూరు ప్రక్రియలు
ఆలస్యమవుతుందని నిర్మాణాలను మొదలుపెట్టి పూర్తి చేస్తున్నారు. పట్టణాలలో మునిసిపల్ అధికారుల
ఆధ్వర్యంలో ప్రభుత్వం నియమించిన కమిటీలు నిబంధనల ప్రకారం లబ్దిదారులను ఎంపిక
చేస్తాయి. ఆ తరువాత లాటరీ ద్వారా ప్లాట్లు
కేటాయిస్తారు.
మరో పక్క
బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఒక్కో బ్లాక్ ని ఒక్కో బ్యాంకుకు కేటాయిస్తారు. బ్యాంకులు కూడా తమ బ్యాంకు
మార్గదర్శకాలను అనుసరించి రుణాలు మంజూరు చేస్తాయి. అపార్ట్ మెంట్ల నిర్మాణం, లబ్దిదారుల ఎంపిక, రుణాల మంజూరుకు సంబంధించి ఒక అవగాహనకు రావడానికి బ్యాంకర్లతో అధికారులు పలుసార్లు సమావేశమయ్యారు. అనుమానాలను నివృత్తి చేసుకొని ఒక
స్పష్టతకు వచ్చారు.
మొత్తం 46 బ్యాంకులు, వాటికీ చెందిన 5,560 శాఖలు ఈ పథకాన్ని అమలు
చేస్తున్నాయి.
బ్యాంకులకు
లక్ష్యాలు నిర్ణయించారు. స్థలాలు
సమకూర్చి, ప్రభుత్వమే ప్లాట్లు నిర్మించి
ఇస్తున్నందున బ్యాంకులు కూడా సామాజిక బాధ్యతగా భావించి రుణాలు త్వరితగతిన మంజూరు
చేయాలని ప్రభుత్వం కోరుతోంది. ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలు ఇళ్ల నిర్మాణంలో
ముందంజలో ఉన్నాయి.
రాష్ట్ర
వ్యాప్తంగా పూర్తి అయిన ఇళ్లను కేటాయిస్తున్నారు. బ్యాంకులు కూడా లబ్దిదారులకు ఖాతాలు
లేకపోతే ఖాతాలు తెరిపిస్తున్నాయి. రుణాలు మంజూరులో చిలకలూరిపేట ఆంధ్రాబ్యాంకు బ్రాంచ్ ముందంజలో ఉంది. అవినీతి జరుగకుండా, లబ్దిదారులు వేధింపులకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం తగిన
జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇల్లు పొందిన
ఆనందం లబ్దిదారుని కళ్లలో కనిపించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని
ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు, మునిసిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలోనే పెద్దఎత్తున చేపట్టిన ఈ ప్రాజెక్టుని ప్రభుత్వం అత్యంత
ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇళ్ల నిర్మాణం, కేటాయింపులు త్వరితగతిన జరగడానికి
ప్రతి 15 రోజులకు సమీక్షా సమావేశం
నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
-
శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
No comments:
Post a Comment