Oct 18, 2020

56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, చైర్ పర్సన్ల ప్రకటన

బీసీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్ల పాలక మండళ్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. బీసీ కార్పొరేషన్‌ల ఛైర్మన్లు , డైరెక్టర్ల పేర్లను ఆదివారం తాడేపల్లిలో మంత్రులు వెల్లడించా. మొత్తం 139 బీసీ కులాలకు  ప్రస్తుతం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక్కో కార్పొరేషన్  చైర్మన్ లేక చైర్ పర్సన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యం కల్పించారు.

కార్పొరేషన్‌ల పాలక మండళ్ల ప్రకటన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శంకర్‌ నారాయణ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు పథకాలు వేగంగా అందించేందుకు ఈ కార్పొరేషన్లను ఏర్పాటు చేసినట్లు ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. గతకొంతకాలంగా దీనిపై కసరత్తు చేసి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


బీసీ కార్పొరేషన్ల  ఛైర్మన్లు


పద్మశాలీ: విజయలక్ష్మి (కడప)

దేవాంగ : సురేంద్రబాబు (ప్రకాశం)

తొగట కార్పొరేషన్‌: గడ్డం సునీత (అనంతపురం)

రజక కార్పొరేషన్‌: రంగన్న (అనంతపురం)

కురుబ కార్పొరేషన్‌: కోటి సూర్యప్రకాశ్‌ బాబు (అనంతపురం)

కుంచిటి వక్కలిగ: డా.నళిని(అనంతపురం)

వన్యకుల క్షత్రియ: కె. వనిత (చిత్తూరు)

పాల ఎకరి: టి. మురళీధర్ (చిత్తూరు)

ముదళియర్ : తిరుపతూర్ గోవిందరాజు సురేష్ (చిత్తూరు)

ఈడిగ : కె.శాంతి (చిత్తూరు)

గాండ్ల : భవాణీ ప్రియ (తూ.గో)

పెరిక : పురుషోత్తం గంగాభవానీ (తూ.గో)

అగ్నికుల క్షత్రియ: భండన హరి (తూ.గో)

అయ్యారక: రాజేశ్వరం (తూ.గో)

షేక్ : షేక్ యాసీన్ (గుంటూరు)

వడ్డెర: దేవల్లి రేవతి (గుంటూరు)

కుమ్మరి శాలివాహన: పురుషోత్తం(గుంటూరు)

కృష్ణ బలిజ/పూసల: కోలా భవాణీ (గుంటూరు)

యాదవ: హరీష్‌కుమార్ (కడప)

నాయిబ్రాహ్మణ : సిద్దవటం యానాదయ్య (కడప)

నూర్ బాషా దూదేకుల: అప్సరి ఫకూర్‌బి (కడప)

సాగర ఉప్పర : గనుగపేట రమణమ్మ (కడప)

విశ్వ బ్రాహ్మణ : తోలేటి శ్రీకాంత్ (కృష్ణా)

గౌడ: మాడు శివరామకృష్ణ (కృష్ణా)

వడ్డెలు: సైదు గాయత్రి సంతోష్ (కృష్ణా)

భట్రాజు: గీతాంజలి దేవి (కృష్ణా)

వాల్మీకి బోయ: డా.మధుసూదన్ (కర్నూలు)

కుమి/కరికల భక్తుల: శారదమ్మ (కర్నూలు)

వీరశైవ లింగాయత్: రుద్రగౌడ్ (కర్నూలు)

ముదిరాజ్: వెంకటనారాయణ (నెల్లూరు)

జంగం: ప్రసన్న (నెల్లూరు)

బొందిలి : కిషోర్ సింగ్ (నెల్లూరు)

ముస్లిం సంచార జాతుల: సయ్యద్ ఆసిఫా (నెల్లూరు)

చట్టాడ శ్రీవైష్టవ: మనోజ్‌కుమార్ (ప్రకాశం)

ఆరెకటిక: దాడ కుమారలక్ష్మి(ప్రకాశం)

మేదర : లలిత నాంచారమ్మ(ప్రకాశం)

కళింగ: పేరాడ తిలక్ (శ్రీకాకుళం)

కళింగ కోమటి/ కళింగ వైశ్య: సూరిబాబు (శ్రీకాకుళం)

రెడ్డిక: లోకేశ్వరరావు (శ్రీకాకుళం)

పోలినాటి వెలమ: కృష్ణవేణి (శ్రీకాకుళం)

కురకుల/పొండర: రాజపు హైమావతి(శ్రీకాకుళం)

శ్రీసైన: చీపురు రాణి( శ్రీకాకుళం)

మత్స్యకార : కోలా గురువులు (విశాఖ)

గవర: బొడ్డేడ ప్రసాద్ (విశాఖ)

నగరాల: పిల్లా సుజాత (విశాఖ)

యాత: పి.సుజాత (విశాఖ)

నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ)

తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్ (విజయనగరం)

కొప్పుల వెలమ: నెక్కల నాయుడు బాబు(విజయనగరం)

శిష్ట కరణం: మహంతి అనూష పట్నాయక్ (విజయనగరం)

దాసరి: రంగుముద్రి రమాదేవి (విజయనగరం)

సూర్య బలిజ: శెట్టి అనంతలక్ష్మి (ప.గో)

శెట్టి బలిజ: తమ్మయ్య (ప.గో)

అత్యంత వెనుకబడిన వర్గాల: వీరన్న (ప.గో)

అతిరస కార్పొరేషన్: ఎల్లా భాస్కర్‌రావు(ప.గో)


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...