కాపులకు
ప్రభుత్వ దీవెన
ఫలించిన
కాపుల పోరాటం
v బీసీలుగా
శాసనసభలో తీర్మానం
v పోరాడి
సాధించుకున్న కాపులు
v కాపులకు
అండగా ప్రభుత్వం
v అభ్యున్నతికి
ఆరు పథకాలు
v ఏడాదికి
రూ.వెయ్యి
నుంచి రూ.1500 కోట్లు
కేటాయింపు
v గ్రామ
స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాపు భవనాలు
'ప్రపంచ కార్మికులారా ఏకంకండి, పోరాడితే
పోయేదేమీలేదు బానిస సంకెళ్ళు తప్ప. విప్లవం ద్వారా నీదైన జీవితాన్ని
నీవు సంపాదించుకుంటావు’’ అనే దాన్ని ‘‘రాష్ట్రంలోని
కాపుల్లారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీలేదు మన మధ్య దూరం
తప్ప, ఉద్యమాల ద్వారా మనదైన జీవితాన్ని మనం సంపాదించుకుందాం’’ అన్న రీతిలో
పోరాడి చాలా వరకు విజయం సాధించారు. రాజకీయంగా బలపడ్డారు. అధికార
పదవులు పొందారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందుతున్నారు.
కుల వ్యవస్థ
వేళ్లూనుకుపోయిన ఈ వ్యవస్థలో ఇతర కులాలకు ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వం కూడా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను
బీసీల జాబితాలో చేర్చడానికి శాసనసభలో తీర్మానం చేసింది.
వారి
సంక్షేమం కోసం ఆరు పథకాలు ప్రవేశపెట్టి
అమలు చేస్తోంది. భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి
సంస్థను ఏర్పాటు చేసింది. ఏడాదికి రూ.వెయ్యి నుంచి రూ.1500 వందల కోట్ల వరకు మంజూరు చేస్తోంది. కాపుల కోసం ప్రత్యేకంగా స్వయం
ఉపాధి, విదేశీ విద్యా దీవెన, విద్యోన్నతి,
నైపుణ్య
అభివృద్ధి, కాపుల భవనాలు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ వంటి
పథకాలు ప్రవేశపెట్టింది.
బ్యాంక్ లతో అనుబంధంగా స్వయం ఉపాధి
పథకం ద్వారా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 46,019 మందికి రూ.588.50 కోట్లు రుణాలు అందజేశారు. 2017-18లో 40,397 మందికి రూ.602.10
కోట్లు
ఇచ్చారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 74,387 మందికి రూ.1487.74 కోట్లు రుణాలుగా అందజేయాలన్నది
ప్రభుత్వ లక్ష్యం. అక్టోబర్ వరకు 56,661 మందికి రూ.795.26
కోట్లు
మంజూరు చేశారు. రుణాల మంజూరులో తూర్పుగోదావరి, కృష్ణా,
ప్రకాశం
జిల్లాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
విదేశీ
విద్యా దీవెన పథకం కింద 2016-17లో 365
మందిని ఎంపిక
చేసి, రూ.39.69 కోట్లు ఖర్చు చేశారు.
2017-18లో
లక్ష్యానికి మించి 1050 మందిని ఎంకి చేసి రూ.64.55 కోట్లు ఖర్చు చేశారు. 2018-19లో వెయ్యి మంది లక్ష్యంగా రూ.110 కోట్లు
కేటాయించారు. అక్టోబర్ వరకు 342 మందిని ఎంపిక చేసి 37.62 కోట్లు మంజూరు చేశారు. సివిల్స్ కు కోచింగ్ ఇవ్వడం కోసం
ప్రవేశపెట్టిన విద్యోన్నతి పథకం ద్వారా 2017-18లో 11
కోచింగ్ ఇన్
స్టిట్యూషన్ల ద్వారా 661 మందికి రూ.14.25
కోట్లు ఖర్చు
చేసి శిక్షణ ఇప్పించారు. వారిలో 8
మంది
యుపిఎస్సీ సివిల్స్ మెయిన్ కు అర్హత సాధించారు.
ఏపీ స్టేట్
స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, ఇతర గుర్తింపు పొందిన సంస్థల ద్వారా 12,463 మందికి నైపుణ్య శిక్షణ ఇప్పించారు. విజయవాడ, రాజమండ్రి, నెల్లూరులలో
నిర్వహించిన జాబ్ మేళాలలో 1284 మంది కాపు యువత షార్ట్ జాబితాకు
ఎంపికయ్యారు. ప్రతి జిల్లా కేంద్రంలో 13 కాపు భవనాల నిర్మాణానికి
ఒక్కోదానికి రూ.2 కోట్ల చొప్పున రూ.26 కోట్లు మంజూరు చేశారు. 10 జిల్లా
కేంద్రాలలో రెవెన్యూ శాఖ భూములు కూడా కేటాయించింది.
2017-18లో 80 మినీ కాపు
భవనాలకు రూ.42.59 కోట్లు మంజూరు చేశారు.
2018-19లో 200 మినీ కాపు
భవనాలు లక్ష్యం కాగా, అక్టోబర్ వరకు 123 భవనాలు, రూ.32.41 కోట్లు మంజూరు చేశారు.
ఇప్పటికే ఒక
భవన నిర్మాణం పూర్తి అయింది. 15 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. 58 భవనాల
నిర్మాణాలు టెండర్ దశలో ఉన్నాయి. మరో 130 భవనాల
నిర్మాణానికి స్థలాన్ని గుర్తించారు. 2017 డిసెంబర్ 21న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల
ప్రకారం 2,82,155 మంది విద్యార్థులు పోస్ట్ మెట్రిక్
స్కాలర్ షిప్ పరిధిలోకి వచ్చారు. గత ఏడాది 1,56,303
మంది
విద్యార్థులు రూ.263 కోట్లు అందజేయగా,
ఈ ఏదాడి
అక్టోబర్ వరకు 1,25,852 మంది విద్యార్థులకు 213.38 కోట్లు ఇచ్చారు. అంతేకాకుండా గ్రామ స్థాయి నుంచి
జిల్లా స్థాయి వరకు మండలాలు, డివిజన్ లలో కాపు కమ్యూనిటీ భవనాల
నిర్మాణానికి తగిన స్థలాలను గుర్తించమని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ రకంగా
అన్ని స్థాయిల్లో, అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం కాపులకు పూర్తి అండగా ఉంది.
-
శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
No comments:
Post a Comment