చంద్రన్న
బీమాకు అత్యంత ప్రాధాన్యత
అధికారులకు
మంత్రి పితాని ఆదేశాలు
Ø
జాప్యం లేకుండా కేసుల అప్ లోడ్
Ø
వారం రోజుల్లో దివ్యాంగ సర్టిఫికెట్
Ø
పది రోజుల్లో క్లెయిమ్ పరిష్కారం
Ø
కమిషనర్ కు, సిబ్బందికి అభినందనలు
Ø
100 శాతం పరిష్కారం అయితేనే సీఎంకు
సంతృప్తి
Ø
ప్రతిశాఖలో మోనిటరింగ్ బాధ్యతలు ఒకరికి
అప్పగింత
సచివాలయం, నవంబర్ 16: దేశం మొత్తంమీద ప్రాముఖ్యత కలిగి, రాష్ట్రానికి ఓ
విశిష్ట స్థానం సంపాదించి పెట్టిన చంద్రన్న బీమా క్లెయిమ్ ల పరిష్కారానికి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం
అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కార్మిక, కర్మాగారాల శాఖల మంత్రి పితాని
సత్యనారాయణ సంబంధింత అధికారులను దేశించారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని
సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం చంద్రన్న బీమా పథకం పనితీరుని ఆయన సమీక్షించారు. ఈ
పథకానికి సంబంధించి అన్ని స్థాయిల్లో సమర్థవంతంగా పని చేస్తున్న కమిషనర్ ని,
సిబ్బందిని మంత్రి అభినందించారు. చంద్రన్న బీమా, చంద్రన్న రైతుబీమా పథకాలకు
సంబంధించి ప్రమాద మరణాలు, సమజ మరణాలు, పరిష్కరించిన క్లెయిమ్ లు, పెండింగ్ లో ఉన్న
క్లెయిమ్ ల వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. ఈ పథకానికి ముఖ్యమంత్రి అత్యంత
ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆయన ఆదేశాల ప్రకారం వేగంగా కేసులు పరిష్కరించాలని మంత్రి
చెప్పారు. కేసులు అప్ లోడ్ చేయడంలో, పరిష్కరించడంలో ఆలస్యం జరుగకుండా చూడాలన్నారు.
బీమా కంపెనీలకు కావలసిన పత్రాలను అందజేస్తే
కేసులను త్వరగా పరిష్కారించడానికి అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల వారికి
కావలసిన పత్రాలు అందజేయడంలో జాప్యం చేయవద్దని చెప్పారు. ఈ పథకంలో ప్రమాద బీమా
కేసులను ఎఫ్ఐఆర్ ఆధారంగా పరిష్కారిస్తారని, అందువల్ల ఆ శాఖ అధికారులు ఎఫ్ఐఆర్
కాపీని అందజేయడంలో జాప్యం చేయవద్దన్నారు. ప్రమాదంలో అంగవైకల్యం ఏర్పడినవారికి వారం
రోజులలో సర్టిఫికెట్ ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.
అలా ఇవ్వడం సాధ్యకాని పరిస్థితుల్లో కారణాన్ని తెలపాలని చెప్పారు. 99 శాతం క్లెయిమ్ లు పరిష్కరించిన ఎల్ఐసీ వారిని
అభినందించి, ఆ ఒక్క శాతం ఎందుకు కాలేదని ప్రశ్నించారు. వంద శాతం ఫలితాలు
సాధిస్తేనే ముఖ్యమంత్రి సంతృప్తి చెందుతారని, ఆ ఒక్క శాతం విషయం ఆయన తమని
అడుగుతారని చెప్పారు. పది రోజుల్లో చంద్రన్న బీమా క్లెయిమ్ లు పరిష్కరించాలని
మంత్రి పితాని ఆదేశించారు.
ఈ పథకానికి సంబంధించిన ప్రతి శాఖలో ఒక వ్యవస్థను ఏర్పాటు
చేసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
జెఎస్ వి ప్రసాద్ అదేశించారు. మోనిటరింగ్ చేసే బాధ్యతను ఒక ఉద్యోగికి
అప్పగించాలన్నారు. పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం
రాబట్టాలని, రావలసిన సర్టిఫికెట్లు తెప్పించాలని చెప్పారు. చంద్రన్న బీమా
ప్రాధాన్యతను, పథకం నియమ నిబంధనలకు సంబంధించి డాక్టర్లకు అవగాహన కల్పించాలని
చెప్పారు. టెక్నాలజీ వినియోగంలో మన రాష్ట్రం ప్రపంచంతో పోటీపడుతోందని, దిగువ
స్థాయిలో పనులు ఆ స్థాయిలో జరగడంలేదన్నారు. అక్కడ మెరుగుపరచవలసిన అవసరం ఉందని ఆయన
చెప్పారు. తిరస్కరించిన క్లెయిమ్ లు పరిశీలించి వాటిని కూడా జాప్యంలేకుండా పరిష్కరించాలన్నారు.
పోలీస్ శాఖలో పెండింగ్ కేసులు 400 నుంచి 80కి తగ్గినట్లు ఆ శాఖ అధికారి చెప్పారు.
గుంటూరు జిల్లా శావల్యాపురం పోలీస్ స్టేషన్ కు సంబంధించి ఒక పెండింగ్ కేసు సమస్య
వివరించగా, దానికి అధికారులు పరిష్కారం చెప్పారు. ఈ సమీక్షా సమావేశానికి కార్మిక
శాఖ కమిషనర్ డి.వరప్రసాద్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈఓ డాక్టర్
పి.కృష్ణమోహన్, ఏపీ వైద్యవిధాన పరిషత్ అధికారి శ్రీదేవి, పోలీస్, బీమా కంపెనీల
అధికారులు హాజరయ్యారు.
No comments:
Post a Comment