రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 4న అల్లూరి జయంతి ఉత్సవాలు
సచివాలయం,జూలై 3: ఈ ఏడాది కూడా ఈ నెల 4న ప్రభుత్వ ఆధ్వర్యంలో
అల్లూరి సీతరామరాజు జయంతి ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం
నిర్ణయించింది.
ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మంగవారం ఉత్తర్వులు
జారీ చేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల అధిపతులు, జిల్లా
కలెక్టర్లు బుధవారం ఈ జయంతి ఉత్సవాలను
ఘనంగా నిర్వహించాలని ఆ ఉత్తర్వులలో కోరారు. ఇందుకు అయ్యే ఖర్చుని
సంబంధిత బడ్జెట్ నుంచి వినియోగించాలని పేర్కొన్నారు.
No comments:
Post a Comment