అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ-పంట
యాప్
అధికారులను ఆదేశించిన సీఎస్
అనీల్ చంద్ర పునేఠ
సచివాలయం, జూలై 3: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ-పంట యాప్ ని రూపొందించమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనీల్ చంద్ర పునేఠ సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తు సీఎస్ సమావేశ
మందిరంలో మంగళవారం సాయంత్రం ఆయన వ్యవసాయ అధికారులతో సమావేశమై ఈ-పంట మొబైల్ యాప్
అప్లికేషన్ ని అభివృద్ధి చేసిన విధానాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ
శాఖ సహకారంతో గ్రామ స్థాయిలో సాగు భూమి, సాగులో లేని భూమి, సర్వే
నెంబర్, భూముల
వివరాలు, మిశ్రమ
పంటలు, పంటల
ఫొటోలు, ఉద్యానవన పంటలతో సహా అన్ని పంటలకు సంబంధించిన
వివరాలను అందులో పొందుపరచాలని చెప్పారు. చార్ట్ లో ఉన్న అన్ని కాలమ్స్ పూర్తి చేయాలన్నారు.
వ్యవసాయ
శాఖ అధికారులు మాట్లాడుతూ జిల్లా,
డివిజన్, మండల, గ్రామ స్థాయిలో సర్వే
నెంబర్ తో సహా పంటల వివరాలు యాప్ లో పొందుపరుస్తున్నట్లు చెప్పారు. పవర్ పాయింట్
ప్రజంటేషన్ ద్వారా సీఎస్ కు వివరించారు. భూములు, పంటల
వివరాలు, సర్వే
నెంబర్ తోపాటు పట్టాదారు పేరు మొదలైన వివరాలు ఇస్తున్నట్లు తెలిపారు. అందులో మొత్తం 31 కాలమ్స్ ఉన్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 4 లక్షల
ఎకరాలలో కూరగాయలు, 70 లక్షల
ఎకరాల్లో ఉద్యానవన పంటలు పండిస్తున్నట్లు వివరించారు. గ్రామానికి, సర్వే నెంబర్ భూమికి ఉన్న దూరాన్ని, మార్గం మ్యాప్ ని కూడా చూపించే విధంగా యాప్ అప్లికేషన్
రూపొందిస్తున్నట్లు తెలిపారు.
యాప్ లో వివరాలు సమగ్రంగా ఉండే విధంగా అనీల్ చంద్ర పునేఠ కొన్ని సలహాలు
ఇచ్చారు. పొలానికి
నెంబర్ కూడా ఇవ్వమని సూచించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ డి.మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment