ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు
బొండా ఉమ, అప్పల
నాయుడు, సుగుణమ్మ, సత్యప్రభ,
సచివాలయం, డిసెంబర్ 2: కాపులకు రిజర్వేషన్ కల్పించాలని శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడం అంటే కాపులకు
ముందుగానే సంక్రాంతి వచ్చిందని, సువర్ణక్షరాలతో
లిఖించదగ్గ రోజని ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బొండా ఉమ, అప్పల నాయుడు, సుగుణమ్మ, సత్యప్రభ అన్నారు. సచివాలయం ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం
మధ్యాహ్నం వారు మాట్లాడారు. పాదయాత్ర సమయంలో చంద్రబాబు నాయుడు కాపుల స్థితితగులు తెలుసుకొని రిజర్వేషన్ కల్పిస్తామని పిఠాపురంలో ప్రకటించారని, దానిని ఈ రోజు అమలు చేసి చూపారన్నారు. కాపు సామాజిక వర్గం, కాపు జాతి ఉన్నంత
వరకు చంద్రబాబు నాయుడుని మరువదన్నారు. ఆయనకు పాదాభివందనం చేస్తున్నామన్నారు. న్యాయపరంగా, సాంకేతికంగా
ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాసనసభలో బిల్లు తీసుకురావడం ద్వారా చంద్రబాబు కాపులకు
న్యాయం చేశారని ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి మండలి ఆమోదించిన తరువాత ఒక్క రోజు వ్యవధిలోనే శాసనసభలో ప్రవేశపెట్టడం ఓ
రికార్డుగా వారు అభివర్ణించారు. బీసీ వర్గాల వారు కూడా దీనిని ఆమోదించడం సంతోషంగా ఉందన్నారు. బీసీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ హయాంలో, ఇప్పుడూ కాపులకు
మంత్రి పదవులు, కార్పోరేషన్ పదవుల
విషయంలో న్యాయం చేస్తున్నారన్నారు.
No comments:
Post a Comment