Aug 21, 2025

ఎస్‌జేఎఫ్ఐ జాతీయ కమిటీలో ఏపీ నుంచి ఐదుగురికి స్థానం


తిరువనంతపురం: 21 ఆగస్టు 2025: ఏపీ నుంచి సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SJFI) ఉపాధ్యక్షులుగా డాక్టర్ టి.జనార్ధన్, జాతీయ కమిటీ సభ్యులుగా  ఎంవీ రామారావు(విజయవాడ), శిరందాసు నాగార్జున రావు (మంగళగరి), హెచ్.ఆజాద్(అనంతపురం),  ఎం.నరేంద్ర(తిరుపతి) ఎంపికయ్యారు. అధికారికంగా ఏర్పడిన అఖిల భారత సీనియర్ జర్నలిస్ట్స్ సమావేశంలో ఈ డిమాండ్ లేవనెత్తారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం వేదికగా  ఎస్‌జేఎఫ్ఐ ఆవిర్భవించింది.  ఎస్‌జేఎఫ్ఐ జాతీయ సమావేశంలో దేశ వ్యాప్తంగా ఉన్న సీనియర్ జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని, ఆరోగ్య బీమా కల్పించాలని, రైల్వే రాయితీలు పునరుద్దరించాలని, జర్నలిస్టులపై దాడులు నివారించాలని..తదితర డిమాండ్లతో తీర్మానాలు చేసింది. 


No comments:

Post a Comment

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...