Jul 24, 2024

వియత్నాంలో పర్యటించే భారత్ బృందానికి కాగితాల రాజశేఖర్ నాయకత్వం

మంగళగిరి: ఇండో-సోవియట్ కల్చరల్ అసోసియేషన్  (ISCUF)తరఫున ఇద్దరు మహిళలతో సహా 23 మంది సభ్యులతో కూడిన భారత ప్రతినిధి బృందం వియత్నాంలో పర్యటిస్తోంది. ఈ బృందానికి  గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఇస్కఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కాగితాల రాజశేఖర్ నాయకత్వం వహిస్తున్నారు. సోవియట్ యూనియన్ పతనం తరువాత ISCUF, దాని చట్టాలను సవరించింది. పొరుగు దేశాలతో, ముఖ్యంగా వియత్నాం, లావోస్, క్యూబాతో సహా ఆసియాలో శాంతి, స్నేహాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టింది. ఇతర దేశాలతో మన దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సాంస్కృతిక సంబంధాలు, స్నేహబంధాలు పెంపొందించేందుకు  ఇస్కఫ్ కృషి చేస్తోంది. అందులో భాగంగానే ఈ బృందం వియత్నాంలో పర్యటిస్తోంది. 



No comments:

Post a Comment

ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?

దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి...