Oct 22, 2022

దూకుడు పెంచిన చంద్రబాబు

 


జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కలవడంతో  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఈ నెల 18వ తేదీ మంగళవారం చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఎన్నికల్లో పొత్తుకంటే ముందు రాష్ట్రంలో  నెలకొన్న పరిస్ధితులపై  ఉమ్మడిగా పోరాడేందుకు తాము కలిసినట్లు ఇద్దరూ  ప్రకటించారు.దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఇద్దరు నేతలు కలిశారు. వీరిద్దరి కలయికతో ఇరు పార్టీల కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇది ఒక అపూర్వ కలయికగా వారు భావిస్తున్నారు.మీడియా కూడా వీరి కలయికకు ప్రాధాన్యం ఇచ్చింది.దీంతో వీరి పొత్తులపై చర్చలు మొదలయ్యాయి. 

పల్నాడు జిల్లా చిలకలూరి పేట నియోజకవర్గం నాదెండ్లలో, నరసరావుపేట నియోజకవర్గం జొన్నలగడ్డలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రత్తి పంటను చంద్రబాబు నాయుడు బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన  పొలం గట్లపై యువకుడిలా నడిచారు.ఓ చిన్న కాలవను ఎగిరి గంతేసి మరీ దాటారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చంద్రబాబు పర్యటనలో భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.నరసరావుపేట, గురజాల బహిరంగ సభలకు జనం భారీగా తరలి వచ్చారు. ఆ జనసమూహాన్ని, కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి చంద్రబాబు నాయుడు కూడా చాలా ఆవేశంతో విజయోత్సాహంతో  ప్రసంగించారు. ప్రజలను ఉత్తేజపరిచారు. 

ఇక పవన్, చంద్రబాబు ఇంత కాలం తరవాత కలవడంతో రాజకీయ పొత్తులపై చర్చించుకోవడం మొదలైంది. అయితే, పొత్తుల ప్రస్తావన రాలేదని ఇరు పార్టీల నేతలు చెప్పారు. ప్రస్తుతానికి పొత్తుల ప్రసక్తిలేకపోయినా వారు కలిసి పోరాడటానికి  సిద్ధమయ్యారు. దీనిని పొత్తుకు మొదటి అడుగుగా భావించవచ్చు.

                                                                      - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...