Aug 19, 2020

రూపాయి ఫీజుతో అమ‌రావ‌తి రైతులకు అండ‌గా ప‌రాశ‌రన్!

 బాబ్రీ-రామ మందిరం వివాదంపై సుప్రీం కోర్టులో వాదించిన  ప్రముఖ నాయవాది, ప‌రాశ‌ర‌న్ ఒక్క రూపాయి ఫీజుతో అమ‌రావ‌తి రైతుల త‌ర‌పున సుప్రీం కోర్టులో వాదించడానికి తన సంసిద్ధత వ్యక్తం చేశారు. మూడు రాజధానులు, అమ‌రావ‌తి భూములు వివాదంపై సుప్రీం కోర్టులో వాదించేందుకు వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌ముఖ న్యాయ‌వాది హ‌రీష్ సాల్వేను నియ‌మించుకుంది. హ‌రీష్ సాల్వే స్థాయిలో త‌మ త‌ర‌పున వాదించే లాయ‌ర్ కోసం రైతులు  ఢిల్లీలో వెతికారు. ఎంత మందిని అడిగినా ఫీజు అధికంగా అడ‌గారు. చివ‌రకు పరాశ‌రన్‌ను ఆశ్ర‌యించారు. రైతుల బాధ‌లు విని చ‌లించిపోయిన ప‌రాశ‌ర‌న్ ఒక్క రూపాయి ఫీజుతో వారి త‌ర‌పున వాదించేందుకు అంగీక‌రించారు.

 

No comments:

Post a Comment

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...