Aug 3, 2020

తెలుగులో విక్టోరియా మహారాణి బంగారు పతకం



ఇది కర్నూలు జిల్లా కోయిలకుంట్లకు చెందిన బుడ్డా వెంగళరెడ్డి గారికి విక్టోరియా మహారాణి ఇంగ్లాండులో చేయించి పంపిన బంగారు తెలుగు పతకం. దీనికి వెనుకవైపు తెలుగు అక్షరాలు, తెలుగు అంకెలున్నాయి. ఈ అక్షరాలు చాలా స్పష్టంగా చక్కగా చదవటానికి రాశారు. "1866 (౧౮౬౬) సంవత్సరములో సంభవించిన క్షామకాలమందు నిరాధారముగా వుండిన తన స్వదేశస్థుల పట్ల జరిగించిన వుత్కృష్టమయిన ఔదార్యమునకు గాను హర్ మెజస్టీ రాణి గారి వల్ల చేయబడిన శ్రేష్ఠమయిన గణ్యతకు ఆనవాలుగా బుడ్డావెంగళరెడ్డి గారికి బహుమానము ఇయ్యబడ్డది."అని ఉంది. తెలుగు అక్షరాలతో బంగారు పతకం లండన్ లో చేయించి ఆంగ్ల పాలకులు ఇవ్వటం అద్భుతమే.
పతకం మన పూర్ణకుంభాన్ని పోలి ఉంది. మన రాజులు ఏర్పరచుకున్న రాజముద్రలు, పూర్ణకుంభాల రూపాలను కూడా బ్రిటీష్ పాలకులు అంత్యంత నిశితంగా గమనించి ఆయా ప్రాంతాల ప్రజల భాషలతోపాటు సంస్కృతీ చిహ్నాలను కూడా స్వీకరించి వాటి రూపాలలోనే పతకాలు కూడా ప్రదానం చేశారు.  పాలనలో తెలుగు అమలు చేసిన విషయంలో మన వాళ్ళకంటే బ్రిటీష్ పాలకులే కొంత నయమనిపించారు.




No comments:

Post a Comment

ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?

దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి...