సాహిత్యం
ఈనాడు ఆదివారం అనుబంధం 2016 డిసెంబర్ 4వ తేదీ సంచికలో సునీత గంగవరపు
గారు ‘మనసే... ఒక పూలతోట’ అనే కథ రాశారు. చాలా బాగుంది. ఈ ఏడాది ఉత్తమ కథలలో
ఒకటిగా ఎంపిక చేయతగినది. ఇందులో పూల
పరిమళం - ప్రకృతి సౌందర్యం ఉంది. ఓ యువతి వ్యథ
- నెగ్గుకొచ్చిన ఓ మహిళ.... వెరసి ఓ జీవితం. ఇది చాలా మందికి చెందిన కథ. వాస్తవ
ప్రపంచంలో ఇటువంటి నరకయాతన అనుభవించిన మహిళలు ఎందరో ఉన్నారు. ఇందులో సావిత్రి పాత్ర చాలా ఉదాత్తంగా ఉంటుంది.
ఈ వ్యవస్థలో కొందరు మగాళ్లకు అద్దంపట్టే పాత్ర రాంబాబుది.
అనుమానంతో భార్య నుంచి వాస్తవాలు రాబట్టడానికి నాటకీయంగా
వ్యవహరించే రాంబాబు లాంటి భర్తల వద్ద అమాయకంగా నిజాలు చెప్పి జీవితాలు నాశనం
చేసుకున్న, చేసుకుంటున్న, నరకయాతన అనుభవించిన, అనుభవిస్తున్న మహిళలు ఈ సమాజంలో
ఎందరో ఉన్నారు. మానసిక వేదన – సుదీర్ఘమైన ఆలోచనలు - నిద్రలేని రాత్రులు- కన్నీళ్లు
– అవమాన భారం ...ఇదే వారి జీవితం. రాంబాబు లాంటి మగవాళ్లు సుఖంగా జీవించలేరు.
భార్యాబిడ్డలను సుఖంగా జీవించనివ్వరు.
ఆత్మాభిమానం గల ఓ మహిళ తీసుకునే నిర్ణయమే ఇందులో సావిత్రి
తీసుకుంది. జీవితాన్ని గౌరవంగా నెగ్గుకొచ్చింది. కథని చాలా చక్కగా ముగించారు. పూలకు, పూల తోటకు సావిత్రికి ఉన్న సంబంధంలో ఎంతో
స్వచ్ఛత ఉంది. ఆ బంధం అనిర్వచనీయమైంది.
ఈనాడు ఆదివారం అనుబంధంలో వచ్చిన కథ మీ కోసం
ఈనాడు ఆదివారం అనుబంధంలో వచ్చిన కథ మీ కోసం
No comments:
Post a Comment