Feb 13, 2013

ప్రజా రాజధాని పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

సీనియర్‌ జర్నలిస్టు, రాష్ట్ర సమాచారం, పౌర సంబంధాల శాఖ(ఐ అండ్ పీఆర్) పీఆర్‌ఓ(ఓఎస్)  శిరందాసు నాగార్జున రావు రాసిన ‘ప్రజారాజధాని’ అమరావతి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయం ఒకటవ బ్లాక్‌లో బుధవారం ఆవిష్కరించారు. రాష్ట్ర విభజన నుండి రాజధాని ఎంపిక, అమరావతి ప్రకటన, రాజధాని ప్రాంత సాధికార సంస్థ (సీఆర్‌డీఏ), అమరావతి అభివృద్ధి సంస్థల ఏర్పాటు, ల్యాండ్‌పూలింగ్‌ పథకం, రైతులు, రాజధాని గ్రామాల ప్రజలు పొందుతున్న ప్రయోజనాలు రచయిత ఇందులో వివరించారు. ఇప్పటివరకు జరిగిన జరుగుతున్న ప్రభుత్వ, ప్రవేటు భవనాల నిర్మాణాలు, రోడ్లు, కేబుల్‌ గ్రిడ్‌ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులన్నింటిని ఫోటోలతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచారు. తాత్కాలిక సచివాలయం మొదలుకొని జుడిషియల్‌ కాంప్లెక్స్‌ భవనం, విట్‌ భవనాల వరకు అన్ని ఫొటోలను ఇందులో పొందుపరిచారు. పుస్తకం రాసిన నాగార్జునను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పీఎస్ శ్రీనివాసరావు, పీఆర్వో పారుపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...